అమరావతి:ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణ సంస్థ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున ఛార్జీల్ని 15 నుంచి 17 శాతం వరకూ పెంచాలని సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు సురేంద్ర బాబు ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.