పాములంటే భయం! ఏక్‌నాథ్‌ షిండే పై విమర్శ

పాములంటే భయం! ఏక్‌నాథ్‌ షిండే పై విమర్శ

ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పాములుగా ట్విట్టర్లో అభివర్ణించారు. ‘సరదాలను కూడా చితకబాదే నైపుణ్యం నేర్చుకోండి. పాముల భయంతో అడవిని వదలకండి. జై మహారాష్ట్ర’ అని విమర్శించారు. ఉద్ధవ్ ఠాకక్రే నేతృత్వంలో శివసేన వర్గానికి చెందిన 18 మంది ఎంపీల్లో 12 మంది మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతుండటంతో మరోసారి శివసేన వర్గానికి పెద్ద షాక్ తగలింది. షిండే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 18 మంది శివసేన లోక్సభ సభ్యులు బుధవారం తనను కలుస్తారనే నమ్మకం ఉందని శిండే అన్నారు. శివసేన రెండు వర్గాలూ దాఖలు చేసిన వ్యాజ్యాల్ని బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos