వాళ్లకేం పనిలేదు.. గువాహటిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు

వాళ్లకేం పనిలేదు.. గువాహటిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు

ముంబై : ‘తిరుగు బాటు ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర లో పనేమీ లేదు. కాబట్టి జులై 11 వరకు గువాహటి లోనే విశ్రాంతి తీసుకోవచ్చ’ని శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ వ్యాఖ్యా నించారు. ‘ఆ ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగొస్తారనే నమ్మకం ఉంది. తమను తిరుగుబాటు దార్లుగా భావించని ఎమ్మెల్యేలు ఇంకా కొందరు ఉన్నారు. ఎందుకంటే వారు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి కుటుంబాలూ మాతో ఉన్నాయి. వారుతిరిగొస్తారనే నమ్మకం ఉంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సంక్షోభంలో బీజేపీ , దేవేంద్ర ఫడ్నవీస్ తలదూర్చకూడదు. వాళ్ల వేలు పెడితే ప్రధాని మోదీ కళంకితుడు అవుతార’న్నారు. జులై 5 వరకు గువాహటిలోనే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉండను న్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రకు వచ్చే అవకాశాల్లేవని, మరికొన్ని రోజులూ రాడీసన్ బ్లూ హోటల్లోనే ఉండే అవకాశాలున్నాయని జాతీయ మీడియా కథ నాలు పేర్కొంటున్నాయి. జులై 5 వరకు హోటళ్లో గదులను బుక్ చేసుకున్నారు. అవసరమైతే బుకింగ్ సమయాన్ని పొడగించుకోవచ్చునని తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos