బాబు వ‌ల్ల భువ‌నేశ్వ‌రికి అపాయం

అమరావతి: ‘చంద్రబాబు వల్లే ఆయన భార్య భువనేశ్వరికి ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో ఆమె జాగ్రత్తగా ఉండాలి. బాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యనూ ప్రమాదంలోకి నెడతారు. ఎందుకంటే జరగని విషయాన్ని జరిగిందని చెప్పడానికి ఏడుస్తూ రెండున్నర గంటలపాటు ప్రెస్ మీట్ పెట్టార’ని వైకాపా శాసన సభ్యు రాలు రోజా వ్యాఖ్యా నించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వ పాలనలో మహిళలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో మాత్రం మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుష్కరాల సమయంలోనూ షూటింగ్ పిచ్చికి అనేక మంది చనిపోయారు. నారాయణ జూనియర్ కాలేజీలో ఆడపిల్లలకు అన్యాయం జరిగింది. గతంలో నాకూ టీడీపీలో అవమానాలు జరిగాయి. రాష్ట్రంలో వనజాక్షికి అన్యాయం జరిగనప్పుడు కూడా స్పందించని భువనేశ్వరి ఇప్పుడు మాట్లాడుతోంది. భర్త చెప్పిన అసత్య ప్రచారం విని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమ్మి వైకాపా నేతల్ని విమర్శిస్తోంది. నువ్వు మాట్లాడడం చూస్తుంటూనే అర్థమవుతోంది. మీరు ఆయన చేస్తోన్న రాజకీయాల్లో చిక్కుకున్నారు. నిజమే ,ఎవరైతే ఆడవారిని ఏడిపిస్తారో, కుట్రలు చేసి వారిని తొక్కేయాలని చూస్తారో అటువంటి వారు వారి పాపాన వారే పోతారు. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఎన్టీఆర్ను ఏడిపించారు. ఆయనపై చెప్పులు విసిరారు. ఎన్టీఆర్ను ఏడిపిం చారు. ఆయనను ఏడిపించిన వారు ఎలా కనుమరుగు అయ్యారో కూడా మనం చూశాం.’అన్నారు. ఇటీవలి వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున భువనేశ్వరి రూ.లక్ష చొప్పున సాయం అందజేసారు. అసెంబ్లీలో తన గురించి తప్పుడు మాటలు మాట్లాడినందుకు కుంగిపోయానని, ఆడవారిని క్షోభపెడితే బాగుపడరని వ్యాఖ్యకు రోజా ఇలా స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos