శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిని భారీ మంచు వల్ల మూసివేసినట్లు అధికారులు గురువారం ఇక్కడ తెలిపారు. మం చు కారణంగా రెండు వేలకు పైగా వాహనాలు రోడ్లపై నిలిచిపోయినట్టు వెల్లడించారు. మంచు కారణంగానే శ్రీనగర్ విమానా శ్రయం నుంచి విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. పలు విమానాల సేవలు రద్దయ్యాయి.