‘అనంత’ ఫలితాల్ని ఆపేయండి

‘అనంత’ ఫలితాల్ని ఆపేయండి

అమరావతి: అనంతపురం లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల ఫలితాల్ని ప్రకటించకుండా నిలిపివేయాని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి విన్నవించారు. తెదేపా అభ్యర్థి పవన్‌ కుమార్‌ రెడ్డి గెలుపునకు రూ.యాభై కోట్ల వరకూ వ్యయం చేసినట్లు ఆయన తండ్రి జె.సి. దివాకర రెడ్డి ప్రకటించటం ఇందుకు కారణం. ఓటర్లను ప్రలోభ పెట్టినందుకు ఆయనపైనా కేసు దాఖలు చేయాలని డిమాండు చేసారు. ఒక్కో ఓటుకు రూ.2 వేలు వంతున నగదు కానుకగా ఇచ్చామని దివాకర్ రెడ్డి బహిరంగంగానే వెల్లడించటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos