గెలుపు ఆశలు వదులుకోని ఆర్జేడీ

గెలుపు ఆశలు వదులుకోని ఆర్జేడీ

పాట్నా: బీహార్ శాసనసభ వోట్ల లెక్కింపు సాయంత్రం ఐదు గంటల సమయానికీ కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి మెజారిటీకి చేరువవుతున్నట్టు తాజా వరవడి వెలువడుతున్నా ఆర్జేడీ మాత్రం ఆశలు వదులుకోలేదు. పూర్తి ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయనే ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాల్లో చోటుచేసుకుంటాయని బలంగా నమ్ముతున్నట్టు ఆర్జేడీ ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు. ‘ప్రస్తుతం ఆధిక్యాలు మాత్రమే వెలువడుతున్నాయి. మహాఘట్ బంధన్కు 122కు పైగానే సీట్లు వస్తాయి. బీహార్కు యువ ముఖ్యమంత్రి వస్తాడు. రాత్రి 7-8 గంటలకల్లా దీనిపై పూర్తి స్పష్టత వస్తుం ద’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos