వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీ బిడ్డ మృతి

వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీ బిడ్డ మృతి

తిరుపతి : ఇక్కడి ప్రసూతి కేంద్రం వైద్యుల నిర్లక్ష్యం మరోసారి తల్లి బిడ్డల్ని బలిగొన్నది. ఆదివారం రాత్రి వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీ విఠయ్యపాళ్యం గిరిజన కాలనీకి చెందిన మేకల రేణుక తిరుపతి ప్రసూతి కేంద్రంలో మహిళ ప్రసవించింది. కానీ పుట్టిన బిడ్డ మృతి చెందింది. తల్లి ప్రాణాన్ని కాపాడేందుకు ఆమెకు ఆపరేషన్ చేస్తున్నపుడు ఆమె కూడా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు. ఇటీవలే ఆ గ్రామానికి చెందిన మరో మహిళ కూడా పురిటి నొప్పులతో అక్కడ చేరి మృతి చెందిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos