హొసూరు : క్రిష్ణగిరి-చెన్నై రహదారిలోని వానియంబాడి అటవీ ప్రాంతంలో కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. తిరుమలగిరుల నుంచి వీటిని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఇంజిన్ మొరాయించడంతో కారు ఆగిపోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన రెవెన్యూ అధికారులు కారును తనిఖీ చేయగా, ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. కారు సహా దుంగలను స్వాధీనపరచుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్లు కారును వదిలేసి, అక్కడి నుండి తప్పించుకున్నారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.