ఢిల్లీ : టీవీ9 ఛానెల్ మాజీ సీఈవో రవి ప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీ, డేటా చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించినా, తప్పించుకుని తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించగా, చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ను దాఖలు చేసింది. ఆయన కోసం సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ , టాస్క్ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుల్లో మరో నిందితుడు నటుడు శివాజీ కూడా విచారణకు హాజరు కాలేదు.