బాంబు పేలుడులో మసూద్‌ అజార్‌కు గాయాలు

బాంబు పేలుడులో మసూద్‌ అజార్‌కు గాయాలు

రావల్పిండి:ఇక్కడి సైనిక ఆసుపత్రిలో సోమవారం సంభవించిన బాంబు పేలుడులో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్తో బాటు మొత్తం పది మంది తీవ్రంగా గాయ పడ్డారని రావల్పిండికి చెందిన మానవ హక్కుల కార్యకర్త అసానుల్లా ట్వీట్ చేసారు.క్షత గాత్రుల్ని చికిత్స కోసం అత్యవసర విభాగానికి తరలించారు. ఘటనాస్థలానికి విలేఖరులకు అనుమతి లభించలేదు. అసానుల్లాతో పాటు మరికొందరు కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఎక్కించారు. ఆసుప్రతిలో జరిగింది ప్రమాదం కాదని,వ్యూహాత్మంగా జరిగిన దాడేనని కొందరు అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos