న్యూ ఢిల్లీ: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచే రంజాన్ సందడి మొదలైంది. ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింల ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా స్థానిక పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.