ఐపీఎల్ స్పాన్సర్ రేసులో బాబా రాందేవ్

ఐపీఎల్ స్పాన్సర్ రేసులో బాబా రాందేవ్

న్యూ ఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగటంతో దానికి ప్రత్యామ్నాయంగా బాబా రాందేవ్ కు చెందిన పతంజలి గ్రూపు అడుగుపెట్టింది. ఇప్పటికే అమెజాన్, జియో, టాటా గ్రూప్, డ్రీమ్ 11, అదానీ గ్రూప్, బైజు యాప్ ప్రయాజకత్వానికి తాపత్రయ పడుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ ను స్పాన్సర్ చేసే అవకాశం కోసం తాము కూడా ప్రయత్నిస్తున్నట్టు పతంజలి గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. పతంజలి గ్రూపు గ్లోబల్ మార్కెట్లో ఓ బ్రాండ్ గా ఎదిగేందుకు ఐపీఎల్ మంచి వేదిక అని భావిస్తున్నామని తెలిపారు. స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐకి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వెల్లడించారు. అయితే, ఐపీఎల్ ను స్పాన్సర్ చేసేంత స్థాయిలో ప్రపంచవ్యాప్త వాణిజ్య పటిమ పతంజలికి లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos