మీ ఆత్మహత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టరు..

మీ ఆత్మహత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టరు..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోని పది వారాలు గడుస్తున్నా.. అతని ఆత్మహత్య కేసులో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా.. రోజుకో విషయం వెలుగుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ కు న్యాయం జరగాలంటూ ఆయన అభిమానులు ట్విటర్ లో #JusticeforSushantSingRajput” అనే హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా సుశాంత్ అభిమానులకు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా మద్దతు తెలిపాడు.సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య కేసులో న్యాయం జరుగుతుందని ట్వీటర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రభుత్వంపై తనకు ఆ నమ్మకం ఉందని తెలిపాడు. ‘సుశాంత్ బ్రో నీవు ఎప్పుడూ మా హృదయాల్లో సజీవంగా ఉంటావు. మీ అభిమానులు మిమ్మల్ని చాలా మిస్సవుతున్నారు. ఈ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు త్వరలోనే న్యాయం దొరుకుతుంది. మీ ఆత్మహత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. మీరు మా అందరికి స్పూర్తి’అని రైనా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జత చేశాడు. సుశాంత్ అభిమానులు ట్రెండ్ చేస్తున్న హాష్ ట్యాగ్ తో రైనా కూడా ట్విట్ చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos