ఈసారి ముందస్తుగానే రుతు పవనాలు

ఈసారి ముందస్తుగానే రుతు పవనాలు

న్యూ ఢిల్లీ : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ సారి వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ చల్లని ప్రకటన చేసింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు కనిపిస్తున్నాయి. హిందూ మహా సముద్ర ద్వి ధ్రువ (ఐడీవో) పరిస్థితులతోపాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవుతుండడంతో ఈసారి రుతు పవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ-వాయవ్య భారత దేశం, ఉత్తర అరేబియా సముద్రం వైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని భావిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని ఐడీఎం పేర్కొంది. అంతే కాదు, సాధారణ వర్ష పాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos