న్యూ ఢిల్లీ : ఆగస్టులో వర్ష పాతం సాధారణం కంటే తక్కువగా దాఖలైంది. ‘దేశంలో గత ఆగస్టు లో తక్కువ వర్ష పాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు కంటే 24 శాతం తక్కువ. 2009 తర్వాత ఇదే అత్యల్పం’అని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతు పవనాల ప్రభావం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. జూన్ లో 10 శాతం ఎక్కువ వర్ష పాతం నమోదైంది. జులై, ఆగస్టు ల్లో వరుసగా 7, 24 శాతం లోటును నమోదైంది.