రైల్వేల ప్రైవేటీకరణ వేగవంతం

ఢిల్లీ : భారత రైల్వేల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాబోతోంది. తేజాస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. దీనిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లడానికి సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos