న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇద్దరు అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ముందు ఏఐసీసీ నిరసనలను చేపట్టింది. హైఔదరాబాదులో బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ ముందు, బెంగళూరులోఒ లాల్ బాగ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. కేంద్రం కక్ష సాధింపుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ ప్రాయోజిత యంగ్ ఇండియా సంస్థ ద్వారా అక్రమ పద్ధతిలో హస్తగతం చేసుకున్నారంటూ మనీ ల్యాండరింగ్ చట్టాల కింద ఈడీ కేసు నమోదుచేసింది.