.జనవరిలో చేసిన హెచ్చరిక నిజమైంది

.జనవరిలో చేసిన హెచ్చరిక నిజమైంది

న్యూ ఢిల్లీ : దేశంలోని రైతన్నలు తమ సత్యాగ్రహంతో దురహంకారం మెడలు వంచారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అన్యాయంపై విజయం సాధించారని రైతులను అభినందించారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే ఆయన శుక్రవారం ట్విటర్ లో స్పందించారు. ‘‘దేశంలోని రైతులు సత్యాగ్రహంతో అహంకారం మెడలు వంచారు. అన్యాయంపై విజయం సాధించిన రైతులకు అభినందనలు. జై హింద్, రైతులకు జై’’ అని పేర్కొన్నారు గత జనవరి 14న తాను ఇచ్చిన ‘‘రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వస్తుంది, నా మాటలను రాసి పెట్టుకోండి’’ అనే ట్వీట్ నూ జతపరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos