అదే అగాధంలోకి దేశాన్ని నెడుతున్నారు

అదే అగాధంలోకి దేశాన్ని నెడుతున్నారు

న్యూ ఢిల్లీ : రైతులు చేస్తోన్న ఆందోళనలకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపు నిచ్చా రు. ‘ఎంఎస్పీ,ఏపీఎంసీ లేకపోవటం వల్ల బిహార్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ అదే సమస్యల అగా ధంలోకి యావత్ దేశాన్ని నెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు రైతులకు మద్దతుగా నిలవాలి’అని విన్నవించారు. కేంద్రం తీసుకొచ్చిన 3వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్నారు రైతులు. శనివారం ఐదో విడత చర్చలు జరపనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించి, కనీస మద్దతు ధరపై రాత పూర్వ క హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కిసాన్ మహాపంచాయత్ అధ్యక్షుడు రామ్పాల్ జట్. శనివారం జరిగే చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలి తం రాకుంటే రాజస్థాన్కు చెందిన రైతులు ఎన్హెచ్-8 నుంచి దిల్లీకి ర్యాలీగా వెళ్లి జంతర్మంతర్ వద్ద ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos