రాహుల్​ ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

రాహుల్​ ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

న్యూ ఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్ నుంచి రాహుల్గాంధీ ఎన్నికవటాన్ని సవాల్ చేస్తూ సరితా నాయర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టి వేసింది. ఆమె తరపు న్యాయ వాదులు పలుమార్లు విచారణలో పాల్గొనకపోవటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు రూ.లక్ష జరిమానా విధించింది. కేరళ సోలార్ స్కామ్కు సంబంధించిన రెండు కేసుల్లో సరిత దోషిగా తేలారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వయనాడ్, ఎర్నాకుళం స్థానాలకు ఆమె వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించి నిరాశ పాలయ్యారు. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ధర్మాసనం పిటిషన్ను కొట్టి వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos