ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ కొత్త వ్యూహాలు

ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ కొత్త వ్యూహాలు

న్యూ ఢిల్లీ : సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని మోదీ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మొదటి దశ ఎన్నికల్లో నిరాశ ఎదురవడంతో మోదీ ఇప్పుడు అబద్ధాలు చెప్పడం ప్రారంభించారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉంటే మోదీ అంతా బాగానే ఉందని చెబుతున్నారని ఆయన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆయన అబద్ధాలకు త్వరలోనే ముగింపు పడనుందని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ విషపు భాష మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos