రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ

రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాదు: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీ భావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. తనను కలిసిన రోహిత్ తల్లి రాధికను రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని రాహుల్ ను ఆమె కోరారు. మరో వైపు మీకు పూర్తి న్యాయం చేస్తానని ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ తో రోహిత్ తల్లి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos