యువతను అగ్నివీరులుగా.. స్నేహితులనేమో దౌలత్‌వీరులుగా మార్చిన మోదీ

న్యూ ఢిల్లీ : ‘50 సంవత్సరాల పాటు తన స్నేహితులకు విమానాశ్రయాలు కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ వారిని దౌలత్ వీర్ (ధన వంతులు)గా మార్చుతున్నారు. మరో పక్క నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చి యువతను అగ్నివీర్గా మార్చుతున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అగ్ని పథ్ పథకం కింద ఉద్యోగంలోకి తీసుకున్న యువత పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘భాజపా వలే కాకుండా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆశయం. నాలుగు నెలల శిక్షణ, నాలుగు సంవత్సరాల ఉద్యోగం.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏంటి..? అది పూర్తి అనిశ్చితితో ఉంది. అగ్నిపథ్ పథకం కింద తీసుకున్నవారి పదవీవిమరణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos