‘కాంగ్రెస్ పార్టీలో ఉంటే సహనం దానికదే అలవడుతుంది’

‘కాంగ్రెస్ పార్టీలో ఉంటే సహనం దానికదే అలవడుతుంది’

న్యూ ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఐదో రోజైన మంగళవారం రాత్రి పొద్దుపోయే దాకా ఏకంగా 15 గంటల పాటు విచారించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ ముగియటంతో రాహుల్ పార్టీ నేతలతో బుధవారం భేటీ అయ్యారు. విచారణలో తనకు ఎదు రైన అనుభవాలను వివరించారు. చివరి రోజు విచారణలో తాము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు కదా. ఇంతటి సహనం మీకు ఎలా వచ్చింది? అని ఈడీ అధి కారులు తనను అడిగినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కదా… కాంగ్రెస్ పార్టీలో ఉంటే సహనం దానికదే అలవడుతుంది. కాంగ్రెస్ పా ర్టీ తన కార్యకర్తలకు సహనాన్ని నేర్పుతుంది. అని తాను సమాధానం చెప్పినట్లు రాహుల్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos