హైదరాబాదు: తెలంగాణ ఆర్టీసీలో 5,100 మార్గాల ప్రైవేటీకరణ తదుపరి చర్యల్ని తీసుకోరాదని ఉన్నత న్యాయ స్థానం శుక్ర వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీఎస్ ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం అనుమతించటాన్ని తెజస ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు సవాలు చేసారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. దీని గురించి మంత్రి వర్గ సమా వేశ నిర్ణయాల్ని తమకు తెలపాలని ఆదేశించింది. కక్షిదారు ఆక్షేపణలకు స్పందించాలని అదనపు అడ్వకేట్ జనరల్ను ఆదేశిం చింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.