అమరావతి: అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తేల్చిచెప్పారు.ప్రజావేదికలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. అక్రమంగా నిర్మించిన భవనంలో సమావేశం పెట్టాల్సి వచ్చింది. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధంగా నిర్మాణమైనది కాదు.ఈ ప్రజావేదిక అవినీతితో కట్టిన భవనం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలిపేందుకే ఇక్కడకు పిలిచాను. ఈ భవనంలో ఇదే చిట్ట చివరి సమావేశం. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని’ ప్రకటించారు. కాంట్రాక్ట్ అంటేనే అవినీతి అనే పరిస్థితికి దిగజారిందని ఆక్రోశించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసినవారికి కాంట్రాక్టులు ఇస్తామని పునరుద్ఘాటించారు.