అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతో ఆరంభం

అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతో ఆరంభం

అమరావతి: అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తేల్చిచెప్పారు.ప్రజావేదికలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. అక్రమంగా నిర్మించిన భవనంలో సమావేశం పెట్టాల్సి వచ్చింది. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధంగా నిర్మాణమైనది కాదు.ఈ ప్రజావేదిక అవినీతితో కట్టిన భవనం. మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలిపేందుకే ఇక్కడకు పిలిచాను. ఈ భవనంలో ఇదే చిట్ట చివరి సమావేశం. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని’ ప్రకటించారు. కాంట్రాక్ట్‌ అంటేనే అవినీతి అనే పరిస్థితికి దిగజారిందని ఆక్రోశించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తక్కువ కోట్‌ చేసినవారికి కాంట్రాక్టులు ఇస్తామని పునరుద్ఘాటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos