ఏనుగు దాడిలో వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన

హొసూరు :  కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని సాపరానపల్లికి చెందిన రైతు ఏనుగు దాడిలో మరణించడంతో, అతని బంధువులు రోడ్డుపై  బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సురేష్ అనే రైతు సోమవారం రాత్రి  తన పొలం వద్ద ఏనుగులను తరుముతుండగా ఒక ఏనుగు అతనిపై దాడి చేసి కాళ్లతో తొక్కి చంపేసింది. ఏనుగులు తరచూ పంటలపై పడి నాశనం చేయడమే కాకుండా ప్రజలను చంపేస్తున్నాయని, వాటిని దట్టమైన అటవీ ప్రాంతానికి తరిమేయాలని సంబంధిత అధికారులను కోరినా పట్టించుకోలేదని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మృతుని బంధువులు డెంకణీకోట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో గంట పాటు రాకపోకలు స్తంభించాయి. డెంకణీకోట ప్రాంతంలో  విచ్ఛలవిడిగా తిరుగుతున్న ఏనుగులను తరిమివేసేందుకు చర్యలు చేపడతామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos