ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారాలు గురు వారం లాభాలతో కొనసాగుతోంది. ఉదయం పది గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 36,549 వద్ద, నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు పుంజుకుని 10,764 వద్ద ఉన్నాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో, మారుతీ, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.