మార్కెట్లకు దండిగా లాభాలు

మార్కెట్లకు దండిగా లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. యుద్ధం ఆలోచన తమకు లేదని అమెరికా, ఇరాన్ ప్రకటిం చ టం ఇందుకు కారణం. దీంతో విపణి పై మదుపర్ల విశ్వాసం అధికమైంది. సెన్సెక్స్ 626 పాయింట్లు లాభపడి 41,444కి, నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 12,213కు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ (3.85%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (3.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.24%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.09%), మారుతి సుజుకీ (2.87%) లాభాల్ని పొందాయి. టీసీఎస్ (-1.72%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.93%), ఎన్టీపీసీ (-0.63%), సన్ ఫార్మా (-0.02%) నష్ట పోయా యి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos