తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా?

తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా?

స్నేహితులతో కలసి యువవైద్యురాలు దిశను పాశవికంగా హత్యాచారం చేసిన అనంతరం ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్‌ ఇంటికి చేరుకున్న అనంతరం తల్లికి మరో రకమైన కట్టుకథ చెప్పినట్లు వెలుగు చూసింది.ఘటన అనంతరం ఇంటికి చేరుకున్న నిందితుడు ఆరీఫ్‌ ఆందోళనగా ఉండడాన్ని గమనించిన ఆరీఫ్‌ తల్లి మొలాన్బీ ఒకటికి రెండుసార్లు ఏమైందని ప్రశ్నించగా తాను లారీ నడుపుతుండగా ఎదురుగా బైక్ మీద ఒక జంట వచ్చిందని, లారీ కంట్రోల్ కాక వారిని గుద్దేసినట్టు చెప్పాడు. ఆ ఘటనలో బైక్ వెనక కూర్చున్న మహిళా అక్కడికక్కడే మరణించినట్టు చెప్పాడు. అతని తండ్రి మాత్రం జాగ్రత్తగా నడపమని మందలించాడు.అనంతరం తనకు కొంచం రెస్ట్ కావాలని ఇక అందరూ పడుకోండి చెప్పడంతో అంతా పడుకున్నారు. ఆ తరువాత పోలీసులు రావడం అతగాడిని పట్టుకెళ్ళడం అన్ని జరిగిపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos