ఎవరి సొమ్ము ఖర్చుపెడుతున్నారు?

ఎవరి సొమ్ము ఖర్చుపెడుతున్నారు?

న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా నిర్వహించనున్న-నమస్తే ట్రంప్ కార్యక్రమానికి వ్యయం చేస్తున్న రూ.100 కోట్లు ఏ శాఖ భరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.’ట్రంప్ పర్యటన కోసం రూ.100 కోట్లు ఒక సమితి ద్వారా ఖర్చు చేస్తున్నారు. సమితి సభ్యులకెవ్వరికీ తాము ఆ సమితిలో సభ్యులమని తెలియదు.ఈ సమితికి ఏ మంత్రి శాఖ డబ్బులు ఇస్తుందో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? సమితి పేరిట అసలు విషయాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది?’ అని ప్రియాంక హిందీలో రాసిన ట్వీట్లో నిలదీశారు.దీని గురించి ఒక హిందీ వార్తాపత్రిక రాసిన వార్తను కూడా ఆమె జతచేశారు.అహ్మదా బాద్లో -నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నాగరిక్ అభినందన్ సమితి(డీటీఎన్ఏఎ్స) అనే సంస్థ నిర్వహిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos