తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి

తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి

తిరుపతి : మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శనివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభృతులు స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన రేణిగుంట నుంచి తిరుపతికి చేరుకుని తర్వాత తిరుచానూరు బయలుదేరారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రాత్రి తిరుమల చేరుకుంటారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం నెల్లూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. సోమవారం చంద్రయాన్-2 ప్రయోగాన్నితిలకిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos