తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.11 మంది ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా తెరాసలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో విలీనం అంచున వేలాడుతోంది.దీంతో కాంగ్రెస్ నేతలతో అసహనం పెల్లుబుకుతోంది.కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెరాసలో చేరడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.ఈ తరుణంలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి పార్టీ మారే నేతలను చెప్పులతో కొడతామంటూ వ్యాఖ్యానించి తనలోని అసహనాన్ని వెల్లగక్కారు.త్వరలో పంచాయితీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఫారాలు తీసుకొని ఎన్నికల్లో గెలిచాక పార్టీ మారితే చెప్పులతో కొడతామంటూ వ్యాఖ్యానించారు.సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ గెలిచాక పార్టీ మారనని లిఖితపూర్వకంగా రాసిన అఫడవిట్ను మీడియాకు చూపించారు.ఒకవేళ పార్టీ మారితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అఫడవిట్లో రాసినట్లు పేర్కొన్నారు.