పెను తుఫానుగా ఫొని

పెను తుఫానుగా ఫొని

అమరావతి: ‘ఫొని’ తుపాను దిశ మంగళ, బుధ వారాల్లో మారి ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా చలించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. మరో ఆరు గంటల్లో తీవ్రంగా మంగళవారం అతి తీవ్రంగా, బుధవారం పెను తుపానుగా మారనుంది. గురు, శుక్రవారాల్లో తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. ఎక్కడ తీరాన్ని దాటుతుందో ఇంకా తెలియరాలేదు. సోమవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం తుపాను ట్రింకోమలీకి 620 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 880 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1050 కి.మీ దూరంలో కేంద్రీ కృతమై ఉంది. బుధవారానికి నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా కదిలే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు ఉండవచ్చు. ఈ నెల 29, 30 తేదీల్లో, కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. గురు, శుక్రవారాల్లో త్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసారు. మే 2న ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ., 3న ఒడిశా తీరంలో 50-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మే 1వ తేదీ వరకు పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో, మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండె ప్రమాద హెచ్చరికలు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos