తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లపై కోసం పోలీసు కేసులు..

తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లపై కోసం పోలీసు కేసులు..

ఇతర భాషల్లో చిన్నాచితక గొడవలు,సంచలనాలతో బిగ్‌బాస్‌ షో విజయవంతంగానే కొనసాగినా తెలుగు,తమిళంలో మాత్రం బిగ్‌బాస్ షోకు మొదటి నుంచి అవాంతరాలు,నిరసనలు,విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.తెలుగులో మూడవ సీజన్‌కు ఇప్పటి వరకు కంటెస్టంట్లు లభించక ఇబ్బందులు ఎదురుగా తమిళంలో ఇప్పటికే మొదలైన మూడవ సీజన్‌ వివాదాల్లో చిక్కుకుంటోంది.బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టంట్లలో ఇద్దరు కంటెస్టంట్ల కోసం పోలీసులు రావడంతో బిగ్‌బాస్‌పై విమర్శలు,అసహనం వ్యక్తమవుతున్నాయి.గతంలో తండ్రి,సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌తో ఆస్తి తగవులతో వార్తల్లో నిలిచిన సినీనటి వనిత తాజాగా మాజీ భర్త ఫిర్యాదు మేరకు మరోసారి వార్తల్లో నిలిచారు.కొద్ది కాలం క్రితం తన నుంచి విడిపోయిన వనిత తన కూతురు జోనితను కిడ్నాప్‌ చేసిందంటూ వనిత మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న వనిత కోసం చెన్నైలోని బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వనితను సుమారు రెండు గంటల పాటు విచారణ చేశారు.విచారణలో సాయంత్రం 5 గంటలకు తన కుమార్తెను పోలీసుల ముందు హాజరుపరుస్తానని చెప్పడంతో వనిత కుమార్తెను ఆమె తరపు న్యాయవాది సహాయంతో పోలీసుల ముందు హాజరుపరిచారు.తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగా తన తల్లితో వచ్చానని, ఆమె దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నట్లు జోనిత  వాంగ్మూలం ఇవ్వడంతో వనిత కిడ్నాప్ కేసు నుండి బయటపడింది. ప్రస్తుతం వనిత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతోంది.ఇదిలా ఉండగా అదే షోలో పాల్గొంటున్న మరొక సెలబ్రిటీ మీరా మిథున్ కోసం కూడా పోలీసులు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు.అందాల పోటీల్లో అలంకరణ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ ఓ పూల వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మీరా మిథున్‌ కోసం బిగ్‌బాస్‌ షోలోకి ప్రవేశించడం హాట్‌టాపిక్‌గా మారింది. అందాల పోటీల్లో  సౌతిండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మీరా మిథున్ తాజాగా 8 తూట్టాగళ్ అనే తమిళన మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా తమిళ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. సెలబ్రిటీగా ఫేమస్ అయిన ఆమె.. రూ.50 వేల కోసం ఒక పూలు అమ్మే వ్యక్తిని మోసం చేసిన ఉదంతంలో చిక్కుకోవటం విశేషం. పాండిబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూలదండల వ్యాపారం చేసే వ్యక్తికి 2018లో మీరా మిథున్ పరిచయమయ్యారట. తాను మిస్ సౌత్ కిరీటాన్ని గెలుచుకున్నానని.. త్వరలోనే సొంతంగా అందాల పోటీ పెట్టనున్నట్లుగా చెప్పారట.అంతేకాదు.. ఈ పోటీ సందర్భంగా డిజైనింగ్ కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి అడ్వాన్స్ గా రూ.50వేలు తీసుకున్నారట. అయితే.. అందాల పోటీ పెట్టకపోవటమే కాదు.. డిజైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడా పూల వ్యాపారి. దీంతో.. ఆమెపైన కేసు నమోదు చేశారు. మీరా ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఉండటంతో ఆమెను విచారించేందుకు బిగ్ బాస్ టీంను పోలీసులు సంప్రదిస్తున్నారు. ఇటీవలే కిడ్నాప్ ఆరోపణలతో ఇదే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వనితను పోలీసులు విచారించింది తెలిసిందే. తాజాగా. మరో వివాదంలోబిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారు ఉండటం చూస్తుంటే..ఈసారి తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారంతా ఏదో ఒక ఆరోపణతో కేసుల్లో ఉన్న వారేనా? అన్న భావన కలుగుతున్నట్లు చెబుతున్నారు. అయినా.. రూ.50వేలకు ఒక సగటుజీవిని సెలబ్రిటీ మోసం చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos