చెన్నై : కరోనా వైరస్ బందోబస్తు నుంచి 55 యేళ్లకు పైబడిన పోలీసు జవాన్లను తమిళనాడు ప్రభుత్వం మనహాయించింది. వారికి కరోనా సులువుగా సోకే అవకాశం ఉండటమే కారణం. ఆ వయస్సు కానిస్టేబుళ్ళు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్.సుధాకర్ తెలిపారు. కానిస్టేబుళ్ళు వరసగా రాత్రి విధుల్ని నిర్వహించరాదన్నారు. వంతుల వారీగా విధుల్ని చేయాలని కోరారు 144 సెక్షన్ అమలుకు ట్రాఫిక్ పోలీసులు రేయింబవళ్లు రహదారి కూడళ్ళలో నిలిచి వాహన చోదకులకు చేతులెత్తి మొక్కుతూ ఇంటి నుంచి బయటకు రావద్దంటూ వేడుకుంటున్నారు.