న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చారిత్రక కట్టడం తాజ్ మహల్ను వీక్షించినా దానిలోని కీలకమైన-షాజ హాన్, ముంతాజ్ల సమాధులను చూడలేక పోయారు. ఇందుకు కారణం ట్రంప్ పొడుగ్గా ఉండటమే. ట్రంప్కు తాజ్ మహల్ చూపించిన ప్రముఖ గైడ్ నితిన్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని మంగళ వారం ఇక్కడవెల్లడించారు.‘తాజ్ మహల్ అందాలకు ట్రంప్ మంత్ర ముగ్దు డయ్యారు.షాజ హాన్,ముంతాజ్ల సమాధులకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉన్నాయి. ఆయన లోపలికి వెళితే గాయపడతారని భద్రతా సిబ్బంది కంగారు పడ్డా’ని వివరించారు.