కరోనా చికిత్సలో ఫలితం ఇస్తున్న ప్లాస్మా థెరపీ

కరోనా చికిత్సలో ఫలితం ఇస్తున్న ప్లాస్మా థెరపీ

న్యూ ఢిల్లీ : తమ ఆస్పత్రిలో కరోనా రోగుల్లో ఒకరు ప్లాస్మా థెరపీకి సానుకూలంగా స్పందిస్తున్నాడని ఇక్కడ మాక్స్ హెల్త్ కేర్ ఆస్పత్రి వైద్యాధికార్లు శుక్రవారం ఇక్కడ తెలిపారు. వెంటిలేటరుపై ఉన్న అతనికి ఇప్పుడు ఆ అవసరం సగానికి తగ్గింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. కరోనాకు ఈ చికిత్సను ప్రయోగా త్మకంగా చేయటం దేశంలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. 50 ఏళ్ల కరోనా రోగికి అతని కుటుంబ సభ్యుల వినతి మేరకు ఈ చికిత్స చేసినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజ చెప్పారు. ‘ఆ రోగి తండ్రి కరోనాతో బుధవారం చనిపోయాడు. దీంతో అతని ప్రాణాలను నిల బెట్టడానికి ఏ ప్రయత్నమైనా చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా థెరపీ చేసినా తమకు అభ్యంతరం లేదని ముందుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కూడా వాళ్లే కలిసారు. అతని నుంచి ప్లాస్మా సేకరించేందుకు ఒప్పించార’ని వివరించారు. ‘ప్లాస్మా థెరపీలోకరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి ఎక్కిస్తారు. అప్పుడు రోగిలో అప్పటికే అభివృద్ధి చెందిన రోగని రోధకాలు గ్రహీత శరీరంలోకి వచ్చి వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇదేమీ కొత్త చికిత్స కాదు. 2003లో సార్స్ చికిత్సలో, 1980లో స్పానిష్ ఫ్లూ చికిత్సలో ఉపయోగించారు. మన దేశంలో ఐసీఎమ్ఆర్, డీసీఏ ఈ చికిత్సకు ఇంకా అధికారికంగా అనుమతి ఇవ్వలేద’ ని విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos