నాతోనే బిహార్​లో నవోదయం

నాతోనే బిహార్​లో నవోదయం

పాట్నా: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్నిరోజుల కిందట సంకేతాలిచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్తో ప్రజలకు చేరువవుతానని ప్రకటన చేశారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. బిహార్లో సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్తో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రాభివృద్ధి కోరుకునేవారు తనతో కలసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బిహార్కు ఒరిగిందేమీ లేదన్నారు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు తనతో కలిసి ముందుకురావాలని కోరారు. 90 శాతం మంది ప్రజలు బిహార్లో మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు చేరువ కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఆరంభం బిహార్ నుంచే అని రెండు రోజుల కింద ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos