ముందుగా టీకాలు వారియర్స్ కే

ముందుగా టీకాలు వారియర్స్ కే

న్యూఢిల్లీ: మరికొన్ని వారాల్లో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్కే తొలుత టీకాల్ని వేస్తామని చెప్పారు. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించారు. ‘ప్రపంచం చవక ధరలో సురక్షితమైన టీకా కోసం అన్ని దేశాలూ భారత్ వైపే చూస్తున్నాయి. టీకా ధర, పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రాజకీయ పక్షాల అధినేత లందరూ తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపండి. వాటిని పరిగణిస్తామ’ని స్పష్టం చేశారు. తమ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. ఈ టీకాను 70 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. శీతల గిడ్డంగుల వివరాలు ఇవ్వాలనీ మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos