విజయవాడ : పెట్రోల్ బాదుడు ఆగడం లేదు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.99.86 కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 37 పైసల మేర పెరిగింది. హైదరాబాద్లో సోమ వారం లీటర్ పెట్రోల్ ధర రూ.103.78కు చేరింది. హైదరాబాద్ కంటే జిల్లాలలో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.59. లీటర్ డీజిల్ ధర రూ.99.01గా ఉంది.