న్యూ ఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 53 పైసలు, డీజిల్పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. 12 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.6.55, డీజిల్ ధర రూ.7.04 పెరగడం గమనార్హం.