చిదంబరంపై లుక్‌అవుట్‌ నోటీసు

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాత్కాలిక ఉప శమనానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం ఇక్కడ తెలిపారు.చిదంబరం ఆచూకీ తెలియక పోవటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపేలా న్యాయవాది కపిల్ సిబల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గొగొయి అయోధ్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభించడంతో సిబల్ పిటిషన్ దాఖలు చేయలేక పోయారు. దీంతో చిదంబరాన్ని ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశాలు న్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos