పార్థా ఛటర్జీపై చెప్పు

పార్థా ఛటర్జీపై చెప్పు

కోల్కతా : పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి మంగళ వారం చేదు అనుభవం ఎదురైంది. ఈఎస్ఐ ఆసుపత్రి వెలుపల ఆయనపై అంటాలా నివాసి సుభద్ర ఘార్వి అనే మహిళ ఆవేశంగా చెప్పు విసిరింది. ‘ఆయన చెప్పు విసిరేందుకే ఇక్కడకు వచ్చాను. పేద ప్రజలు చమటోడ్చి సంపాదించినన సొమ్మును ఆయన దండుకున్నారు. ఆయన మాత్రం విలాసవంతమైన కార్లలో తిరుతున్నాను. నేను విసిరిన షూ ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం. రూ.55 కోట్లకు పైగా నగదు పట్టుబడటంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నగదు కుంభకోణం బయటపడిన తర్వాత కూడా ఎందుకు ఆయనకు (మాజీ మంత్రి) ఖరీదైన నసేవలు అందిస్తున్నా. వీల్చైర్ సౌకర్యం ఎందుకు ఇస్తున్నారు? ఆయన నడవలేరా? ’అంటూ అగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos