పార్ట్ టైం రేషన్ షాపులు ప్రారంభం

పార్ట్ టైం రేషన్ షాపులు ప్రారంభం

హోసూరు : రెండు పార్ట్ టైమ్ రేషన్ షాపులను హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ప్రారంభించారు. మత్తిగిరి సమీపంలోని నవది, చిన్న బేలగొండపల్లి గ్రామాలలో పార్ట్ టైం రేషన్ షాపులను ప్రారంభించాలని రెండు గ్రామాల ప్రజలు అధికారులను కోరుతూ వచ్చారు. ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.అందగులో భాగంగా యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, రెండు గ్రామాలలో రేషన్ షాపులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె పార్టీ నాయకుడు హరీష్ రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ నారాయణస్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos