మోదీకి ప్రణబ్‌ ఆశిస్సులు

మోదీకి ప్రణబ్‌ ఆశిస్సులు

న్యూఢిల్లీ : ప్రధాని నరేం‍ద్ర మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదం సబ్‌కా సాథ్,సబ్‌ కా వికాస్,సబ్‌కా విశ్వాస్‌ సాకారం కావాలని ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్ను రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు. ‘ప్రణబ్తో ఎప్పుడు కలిసినపుడల్లా అనిర్వచనీయమైన అనుభూతిని కలుగుతుంది. అపార విజ్ఞానం ఆయన సొంతం. అసలైన రాజనీతిజ్ఞుడ’ని మోదీ ట్వీట్‌ చేశారు. ‘మోదీతో భేటీ ఆహ్లాదంగా సాగింది. ఆయన రెండోమారు ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమతున్న దశలో శుభాకాంక్షలు అందిస్తున్నా’నని ప్రణబ్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు. ప్రణబ్‌ నివాసంలో ప్రధాని మోదీకి ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos