టోక్యో : పారాలింపిక్స్లో భారత్ క్రీడాకారులు సోమవారం అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. నాలుగు పతకాలు తెచ్చారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫీల్స్లో(ఎస్హెచ్1) అవనీ లేఖరా స్వర్ణాన్ని సాధిం.చారు. ఈ క్రీడల్లో భారత్కు ఇదే తొలి బంగారు పతకం. పారా ఒలింపిక్స్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కూడా. 249.6 స్కోర్ చేసింది. పురుషుల డిస్కస్ త్రోలో(ఎఫ్56) యోగేష్ కతునియా 44.38 మీ త్రో చేసి రజిత పతకాన్ని కైవసం చేసుకున్నారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝఝారియా రజత పత కాన్ని, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకాన్ని గెలుచు కున్నారు.