పాకిస్థాన్‌ మీడియా పైత్యం..

  • In Sports
  • June 12, 2019
  • 125 Views

ఇంగ్లండ్‌ వేదికగా గతనెల30వ తేదీన క్రికెట్‌ ప్రపంచకప్‌ మొదలైన విషయం తెలిసిందే.ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి మూడవ పట్టికలో కొనసాగుతున్న భారతజట్టు ఈనెల16వ తేదీన దాయాది పాకిస్థాన్‌తో తలపడునున్న విషయం తెలిసిందే.భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజే వేరు.యుద్ధానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఇరు దేశాల్లో ప్రజలు మ్యాచ్‌పై భావోద్వేగంతో ఉంటారు.ఈ నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన ఓ మీడియా ఛానెల్‌ రూపొందించిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో ఆ ఛానెల్ ఏకంగా పాక్ సైన్యానికి పట్టుబడి ధైర్యంగా వ్యవహరించి తిరిగివచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ ను కించపరుస్తూ వ్యవహచింది. పాక్ తో పోరులో టీమిండియా భయపడిపోతున్నట్లుగా  పాకిస్థాన్ కు చెందిన జాజ్ ఛానెల్ తన పైత్యాన్ని ప్రదర్శించింది. ఈ పైత్యం పాళ్లు ఏ మేర ఉన్నాయంటే..సదరు వీడియోలో అచ్చుగుద్దినట్లు అభినందన్ లానే కనిపించే ఓ వ్యక్తికి టీమిండియా జెర్సీ వేసింది. టాస్ గెలిస్తే ఏం చేస్తారని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే… ఐయామ్ సారీ – నేనేమీ చెప్పకూడదు అంటూ ఆ వ్యక్తితో చెప్పించారు. చివరలో టీ కప్ తో అతడు వెళుతుంటే… కప్పును ఎక్కడికి తీసుకెళతావంటూ దానిని లాగేసుకుంటారు. ఇదీ ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు.ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వీడియోపై నెటిజన్లు ఒక రేంజులో ఆటాడేసుకుంటున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos