‘మోదీ పాకిస్థాన్ రాయబారి’

‘మోదీ పాకిస్థాన్ రాయబారి’

కోల్కతా: ‘ప్రధాని మోదీ పాకిస్థాన్ రాయబారిలా వ్యవహరిస్తున్నారు. భారత్ గురించి మాట్లాడానికి బదులు.. రోజంతా పాకిస్థాన్ గురించే మాట్లాడుతున్నార’ని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె ప్రసంగించారు. ‘ఎందుకు మన దేశాన్ని ఎప్పుడూ పాకిస్థాన్తో పోల్చుతున్నారు. దానికి బదలు హిందుస్తాన్ గురించి మాట్లాడండి. మేం హిందుస్థాన్ను ప్రేమిస్తున్నాం. ప్రధాని మోదీ పాకిస్థాన్ రాయబారి అయినట్లు రోజంతా ఆ దేశం గురించే మాట్లాడుతున్నార’ని విమర్శించారు. ‘ఎవరైనా నిరుద్యోగులు తమకు ఉద్యోగం కావాలని అడిగితే ప్రధాని మోదీ వారిని పాక్కు వెళ్లమంటున్నారు. ఎవరైనా పరి శ్రమలు రావడం లేదని అంటే వారినీ పాక్ వెళ్లమంటున్నారు. పాకిస్థాన్ చర్చను పాకిస్థాన్ చేసు కుంటుంది. మనం హిందుస్తాన్ గురించి చర్చిద్దాం. ఇది మన జన్మ భూమి’అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos